ఆటో ఢీకొని విద్యార్థి మృతి..

నవతెలంగాణ- డిచ్ పల్లి
డిచ్ పల్లి పోలిస్ స్టేషన్ పరిధిలోని ఘన్పూర్ గ్రామంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న 12 ఎళ్ళ విద్యార్థి ఆటో ఢీ కొనడంతో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డిచ్పల్లి ఎస్సై మహేష్ తెలిపారు.అయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నాగారం లోని బాబన్  సాబ్ పహాడ్ ఏరియాకి చెందిన సయ్యద్ హమీద్ గురుకులంలో చదువుకుంటున్నాడు ఆదివారం సాయంత్రం అమ్మమ్మ బేగం , చిన్నమ్మ  హైమది బేగం లతో పాఠశాల కు కొద్ది దూరంలో ఉన్న దర్గా వద్దకు వెళ్లి వారు తీసుకొచ్చిన  భోజనం చేసి ఆడుకుంటుండగా ఆటో ఒక వైపు నుండి వస్తున్న అటో ఢీ కొట్టింది. సయ్యద్ హమీద్ కు తీవ్ర గాయాల పాలయ్యారు.వెంటనే హుటాహుటిన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు. తల్లి రిజ్వన బేగం  ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చురీకి తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Spread the love