ఇంటర్ ఫలితాలలో క్షత్రియ విద్యార్థుల విజయకేతనం

నవతెలంగాణ – ఆర్మూర్ 

ఇంటర్ మొదటి, రెండవ పరీక్ష ఫలితాలలో క్షత్రియ విద్యార్థులు రాష్ట్రస్థాయి మార్కులతో అన్ని గ్రూపులలో విజయకేతనం ఎగురవేసినట్టు కళాశాల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ బుధవారం తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ విభాగంలో467/470 టి మధురిమ , 466/470 కే రుచిత  465/470 షేక్ మౌలాలి 464/470 కె వివేక్ రెడ్డి , 464/470 అశ్లేష 2545114999, 464/470 కే అలేఖ్య, బైపిసివిభాగంలో 436/440 కె. శ్రీకృతి435/440 బి. కీర్తన ,ఎంఈసి విభాగంలో 487/500 బి. లీషా ,సిఇసి విభాగంలో 448/500 బి. అక్షయ, ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీవిభాగంలో 981/1000 జే అర్చన హాల్ , 981/1000 ఎం.రోషిని 979/1000 ఆర్. నేహా బైపిసివిభాగంలో 973/1000 అమీనా, 972/1000 హరిణి శర్మ ఎంఈసి విభాగంలో 964/1000 ఏ. రాకి ,సిఇసివిభాగంలో 964/1000 బి స్వామి మార్కులు సాధించినట్ల తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటుచేసిన అభినందన సభలో దృశ్య, శ్రవణ మాధ్యమం ద్వారా  కళాశాల చైర్మన్  అల్జాపూర్ శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. కళాశాల ట్రెజరర్ అల్జాపూరు గంగాధర్ విద్యార్థులకు స్వీట్స్, పూల బొకేతో సన్మానించారు. ఈ యొక్క కార్యక్రమంలో  కళాశాల వైస్ చైర్మన్ అల్జాపూర్ లక్ష్మీనారాయణ, సెక్రెటరీ అల్జాపూర్ దేవేందర్,శ్రీ అల్జాపూర్ పరిక్షిత్, ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు  ఉపాధ్యాయ, ఉపాధ్యేతర సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అభినందించారు.
Spread the love