ఉత్కంఠకు తెర

– బీజేపీ అభ్యర్థిగా సునిల్ రెడ్డి
– మంథనిలో త్రిముఖ పోటీ
నవతెలంగాణ- మల్హర్ రావు
మంథని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా చందుపట్ల సునీల్ రెడ్డి పేరును బీజేపీ అధిష్ఠానం మూడవ విడతలో గురువారం ప్రకటించింది.దీంతో మంథని నియోజకవర్గ బీజేపీలో ఉన్న ఉత్కంఠకు తెరపడింది. సునీల్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అప్పటి బీఆర్ఎస్ పార్టిలో మంథని నియోజకవర్గంలో చురుగ్గా పాల్గొన్నారు.2014లో బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోవడంతో మంథని ఎమ్మెల్యే గా ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓటమి చెందారు.అనంతరం బీజేపీలో చేరి మంథని నియోజకవర్గంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఆయన బీజేపీ పార్టీ కోసం చేస్తున్న కృషిని గ్రహించిన బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ మూడో లిస్ట్ లో ఆయన పేరు కేటాయించింది.దీంతో మంథనిలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. దీంతో మంథని అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.
Spread the love