సిలబస్ సకాలంలో పూర్తి చేయాలి: రిజిస్ట్రార్ ఎం యాదగిరి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
వేసవి సెలవుల అనంతరం తెలంగాణ యూనివర్సిటీ లో గురువారం విభాగాధిపతుల  సమావేశంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి ముఖ్యఅతిథిగా హాజరై  సిలబస్ ను సకాలంలో పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇంటర్నల్ మార్క్స్, ప్రాక్టికల్స్, థియరీ ఎగ్జామ్స్  అల్మానకు అనుసరించి నిర్వహించాలన్నారు. తరగతి గదిలో సృజనాత్మకతను పెంచే  కార్యక్రమాలను నిర్వహిస్తూ విద్యార్థులలో విశ్లేషణాత్మక జ్ఞానాన్ని పెంపొందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ప్రొఫెసర్ అరుణ, విభాగాధిపతులు, ప్రొఫెసర్ సిహెచ్ ఆంజనేయులు, ప్రొఫెసర్ మూసాకురేష్, డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ అడికే నాగరాజు, డాక్టర్ బ్రమరాంబిక, డాక్టర్ శాంతాబాయి, డాక్టర్ లక్షణ చక్రవర్తి, డాక్టర్ శిరీష, డాక్టర్ జమీల్ అహ్మద్, డాక్టర్ ఏ పున్నయ్య, డాక్టర్ రమణాచారి  తదితరులు పాల్గొన్నారు.
Spread the love