15 లీటర్ల గుడుంబా పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

నవతెలంగాణ ధర్మారం: మండలంలోని బొమ్మారెడ్డిపల్లి గ్రామంలో గుడుంబా అక్రమంగా తయారుచేసి అమ్ముతున్నారనే విశ్వసనీయ సమాచారంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్, తన సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు.  సుమారు 15 లీటర్లు గుడుంబా స్వాధీనం చేసుకొని గుడుంబా అమ్ముతున్న వ్యక్తి కొత్తపల్లి గ్రామానికి చెందిన అజ్మీరా రాజేశం (తండ్రి జగన్ నాయక్)ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీన పరుచుకున్న గుడుంబా సహా నిందితుడిని తదుపరి విచారణ నిమిత్తం ధర్మారం పోలీస్ స్టేషన్లో అప్పగించినట్టు టాస్క్ ఫోర్స్ ఇన్ స్పెక్టర్ తెలిపారు.

Spread the love