- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఉపాధ్యాయ,విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం మండలంలోని కుదాభక్షపల్లి,దామెర భీమనపల్లి ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలను ధరించి ప్రభుత్వానికి నిరసన తెలుపడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ఆరు డి ఏ ల తో పాటు,2023 లో ఇవ్వాల్సిన రిపోర్ట్ తెప్పించుకొని వెంటనే ఫిట్మెంట్ ప్రకటించి అమలు చేయాలని,సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ పునరుద్ధయించాలని,అన్ని రకాల సప్లమెంటరీ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆయ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -



