నేడు తెలంగాణ దశాబ్ది వేడుకలు…

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావడంతో నేటి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉ.9.30గం.కు CM రేవంత్ గన్‌పార్క్‌లోని అమరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు. 9.55గం.కు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయజెండా ఆవిష్కరిస్తారు. ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికార గేయంగా జాతికి అంకితమిస్తారు. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కళాకారుల ధూం ధాం ప్రదర్శనలు, లేజర్ షో, ఫైర్ వర్క్స్, కార్నివాల్ కార్యక్రమాలు ఉంటాయి.

Spread the love