ఆసీస్‌తో వన్డే, టీ20 సిరీస్‌.. భారత జట్టు ప్రకటన

నవతెలంగాణ – హైదరాబాద్: ఆసీస్‌ మహిళా జట్టుతో వన్డే, టీ20 సిరీస్‌కు భారత మహిళా జట్టును బిసిసిఐ సోమవారం ప్రకటించింది. వన్డే, టీ20 సిరీస్‌కు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. డిసెంబర్‌ 28న వాంఖడే వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ వైట్‌ బాల్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఆసీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు టీమిండియా ఆడనుంది. వన్డే సిరీస్‌ వాంఖడే వేదికగా జరగనుండగా.. టీ20 సిరీస్‌ డివై పాటిల్‌ స్టేడియంలో జరగనుంది.

భారత మహిళల వన్డే జట్టు : హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), అమంజోత్‌ కౌర్‌, శ్రేయాంక పాటిల్‌, మన్నత్‌ కశ్యప్‌, సైకా ఇషాక్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, సాధు, పూజా వస్త్రాకర్‌, స్నేహ రాణా, హర్లీన్‌ డియోల్‌

భారత మహిళల టీ20 జట్టు : హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌), జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, యాస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), రిచా ఘోష్‌ (వికెట్‌ కీపర్‌), అమంజోత్‌ కౌర్‌, శ్రేయాంక పాటిల్‌, మన్నత్‌ కశ్యప్‌, సైకా ఇషాక్‌, రేణుకా సింగ్‌ ఠాకూర్‌, సాధు, పూజా వస్త్రాకర్‌, కనికా అహుజా, మిన్ను మణి

Spread the love