నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచిన గోదాంను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీఓ లోకేశ్వర్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల కోసం వంద చొప్పున బ్యాలెటింగ్, కంట్రోలింగ్ యూనిట్లు, వీవీప్యాట్ అవసరం ఉన్నందున గోదాంలో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మొదటి విడత పరిశీలన కార్యక్రమం పూర్తిచేసి పార్లమెంట్ ఎన్నికలలో ఉపయోగిస్తమని తెలిపారు. గోదాంలో ఉన్న సీసీటీవీల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ మధుకర్, డిప్యూటి తహపీల్దార్ జితేందర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.