నవతెలంగాణ ముంబై: పతంగి మాంజా ఒక కానిస్టేబుల్ను బలి తీసుకుంది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ పతంగి మాంజా వలన గొంతు తెగి చనిపోయాడు. ముంబై దిండోశి పోలీసు స్టేషన్కు చెందిన సురేష్ జాదవ్ అనే కానిస్టేబుల్ ఆదివారం డ్యూటీ ముగించుకుని మోటార్ సైకిల్పై వర్లి లోని తన ఇంటికి శాంతాకృజ్ దగ్గర వాకోలా బ్రిడ్జి మీదుగా వెళ్తుండగా పతంగి మాంజా వలన గొంతు కోసుకుపోయి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ అతడిని సియాన్ హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.