నవతెలంగాణ – వేళచ్చేరి: తమిళనాడులో నాటు సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 25కు చేరింది. కళ్లకురిచ్చి జిల్లా కరుణాపురం ప్రాంతంలో మంగళవారం పలువురు సారా తాగి అనారోగ్యానికి గురయ్యారు. వారిలో మరో 60 మంది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాటుసారా ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ విచారణకు ఆదేశించారు. కల్లకురిచి కలెక్టర్పై బదిలీ వేటు వేయడంతో పాటు ఎస్పీని సస్పెండ్ చేశారు.