![](https://navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230827-WA06491-300x169.jpg)
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలను వచ్చే నెల 2, 3 తేదీల్లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, అక్టోబర్ 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు. ప్రత్యేక శిబిరాల రోజులలో జిల్లా లోని 791 పోలింగ్ కేంద్రాలలో బూత్ స్థాయి అధికారులు ఓటరు జాబితాతో అందుబాటులో ఉంటారని అన్నారు. . కొత్తగా ఓటరు నమోదుకు ఫారం- 6, సవరణలు, మార్పులు, చేర్పులకు ఫారం 8, తొలగింపుకు ఫారం 7 ను వినియోగించుకోవాలని సూచించారు . ఆయా ఫారాలు అన్ని పోలింగ్ కేంద్రాలలో అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రత్యేక ఓటరు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకొని ఓటరు జాబితాలో తమ పేరు ఉన్నదీ లేనిది పరిశీలించుకొని, పెరు లేకపోయినా, తప్పులున్నా వెంటనే సంబంధిత ఫారాలు నింపి బి.ఎల్.ఓ లకు అందజేయాలని సూచించారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటే కీలకమని గుర్తించి ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.