ఎన్నికల నిర్వహణ ప్రక్రియ సజావుగా జరగాలి: కలెక్టర్

– సూర్యాపేట డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పరిశీలన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్
– సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్య రావ్ సూర్యవంశీ
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టామని జిల్లా  ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ అన్నారు. ఆదివారం స్థానిక సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ లో ఏర్పాటు చేసిన నల్గొండ పార్లమెంట్ నియోజక వర్గ  పరిధిలోని సూర్యాపేట అసెంబ్లీ సెగ్మెంట్ డిట్రిబ్యూషన్ సెంటర్ ను సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మణిక్యరావు సూర్యవంశీ , యస్.పి రాహుల్ హెగ్డే లతో కలసి కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నియోజక వర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన డిట్రిబ్యూషన్ కేంద్రాల్లో  ఆయా పరిధిలో గల పోలింగ్ కేంద్రాలకు రూట్ ల వారీగా పోలింగ్ సిబ్బంది, ఈవిఎమ్స్  సెక్టార్ అధికారి పర్యవేక్షణ లో పోలీస్ బందోబస్తుతో వాహనాలను తరలించామని కలెక్టర్ తెలిపారు. అదేవిదంగా జిల్లాలో ఏర్పాటు చేసిన 112 రూట్లలో 1201 పోలింగ్ కేంద్రాలకు ఏర్పాటు చేయడం జరిగిందని, జిల్లాలో 10,000,12 మంది ఓటర్లు ఉన్నారని, 123 సెక్టార్ అధికారులు, 5600 మంది పోలింగ్ అధికారులు అలాగే 173 మంది మైక్రో అబ్జర్వర్లు,వాలంటరీలు 729 మంది, అంగవైకల్యం ఉన్న వారికై 729 ఆటోలు ఏర్పాటు చేశామని తెలిపారు.
229 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో  లోపల, బయట 458 కెమెరాలను పోలింగ్ పరిశీలన జరుగుతుందని తెలిపారు. 1201 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ క్యాస్టింగ్ జరుగుతుందని అలాగే సమస్యాత్మక  పోలింగ్ కేంద్రంలో ఐదు మంది పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తారని తెలిపారు. అంతకు ముందు కోదాడ లోని  ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని సాధారణ పరిశీలకులు తో కలసి కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.నెడు పోలింగ్  ఉదయం 7.00 ల నుండి సాయంత్రం 6.00 వరకు జరిగితుందని ఓటర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన  12 రకాల గుర్తింపు కార్డులు చూపి ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.జిల్లాలో ఇప్పటివరకు సి. విజిల్ ద్వారా 69 ఫిర్యాదులకు 53 పరిష్కరించామని, 16 డ్రాప్ అయ్యాయని తెలిపారు.జిల్లాలో అన్ని చెక్ పోస్టుల ద్వారా నేటి వరకు నగదు రూ.2,92, 07,642  .00 అలాగే బంగారం, వెండి విలువ రూ.1,21,43,767.00 అలాగే ఇతర వస్తువులు1,06,96,801.90 సీజ్ చేసామని అలాగే సీజ్ చేసిన నగదు రూ.2,32,642.00 అలాగే మొత్తం సీజ్ చేసిన బంగారం, వెండి అలాగే ఇతర వస్తువులు విడుదల చేయడం జరిగిందని నగదు రూ. 75 వేలు మాత్రమే బాధితులకు అందచేయవలసి ఉన్నదని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ  వేణు మాధవ్, డి.ఎస్.పి. రవి,  తహసీల్దార్లు  శ్యామ్ సుందర్ రెడ్డి, కృష్ణయ్య, మహేంద్ర రెడ్డి, వినోద్ కుమార్ ఆర్.టి.సి  జి. ఏకాంబరం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 48 ఆదర్శ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు..
జిల్లాలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రతి నియోజక వర్గంలో ఐదు ఆదర్శ మహిళ పోలింగ్ కేంద్రాలు, ఒక్క ఆదర్శ  వికలాంగుల  పోలింగ్ కేంద్రం, ఒక ఆదర్శ యూత్ పోలింగ్ కేంద్రం అలాగే ఐదు ఆదర్శ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇట్టి పోలింగ్ కేంద్రాలను ఓటర్లు తప్పక వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచి ఇతర పోలింగ్ కేంద్రాలకు ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.
Spread the love