![](https://navatelangana.com/wp-content/uploads/2024/05/IMG-20240515-WA0046.jpg)
తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ , జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య , ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో డిప్యూటీ డి.ఎం.& హెచ్.వో లు, ప్రోగ్రామాధికారుల బృందం భువనగిరిలోని జయలక్ష్మి హాస్పిటల్, నిర్మల హాస్పిటల్, కేకే ప్రైవేటు నర్సింగ్ హోమ్ ఆస్పత్రులలో అకస్మాత్తుగా తనిఖీ తనిఖీ చేసినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. వై. పాపారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ మధ్యకాలంలో నిబంధనకు విరుద్ధంగా చాలా ప్రైవేట్ ఆసుపత్రిలో సాధారణ కాన్పులు తగ్గించి సిజేరియన్ కాన్పుల్ ఎక్కువగా చేస్తున్నారని, ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనకు వ్యతిరేకం అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే తల్లుల్లో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. తగిన కారణాలు లేకుండా సిజేరియన్ చేసినచో కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈరోజు బృందం తిరిగి మూడు ఆసుపత్రుల్లో రిపోర్ట్లు పేషంట్ కే సీట్లు పరిశీలించడం జరిగిందనారు. వీటిలో కొన్ని కాన్పులకు సరైన కారణాలు పొందుపరచలేదని వీటి విషయంలో ముందుగా నోటీసులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నిబంధనలు ఇప్పటివరకు ప్రిన్స్ ఆసుపత్రి, గాయత్రీ హాస్పిటల్, మహేంద్ర ఆసుపత్రిలకు నోటీసులు ఇవ్వడం జరిగిందనీ, తిరిగి వారి వివరణ అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం తదుపరి చర్యలు ఉంటాయన్నారు అర్హత లేని వారు సిజేరియన్ ఆపరేషన్లు చేసినట్టయితే అలాంటి హాస్పిటల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. ప్రజలందరూ కూడా ముహూర్తాలు పాటించి మంచి రోజున అను నొప్పులు భరించలేని సిజరిన్లకి ముగ్గు చూపకూడదని కాన్పులోచ్చే వరకు ఆగి సాధారణ ప్రసవాలు చేయించుకోవాలన్నారు. ఉమ్మనీరు పెంచుకోవడానికి రక్తం తగినంత ఉండేలా చూసుకోవడానికి వైద్యుల సూచనలు మేరకు ఆహార పదార్థాల ద్వారా పొందాలన్నారు. తదుపరి మూడు రోజులు జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్ చేస్తున్న ఆసుపత్రిలో తనిఖీలు ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపజిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు డా శిల్పిని, డా యశోద, ప్రోగ్రాం అధికారులు డా. సుమన్ కళ్యాణ్, డెమో మధుసూదన్ రెడ్డి, సిహెచ్ఓ నగేష్ , శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.