![](https://navatelangana.com/wp-content/uploads/2024/01/bus-2.jpg)
నవతెలంగాణ – బెజ్జంకి
మద్యం మత్తులో డ్రైవర్ లారీ నడపడంతో డివైడర్ పైకెక్కి అవతలి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన సంఘటన మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులో రాజీవ్ రహదారిపై మంగళవారం జరిగింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ డివైడర్ పైకెక్కి అవతలి వైపు కరీంనగర్ నుండి బెజ్జంకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక వైపు ఢీకొట్టి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలవ్వగా, బాధితులను కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి 108 అంబులెన్స్ యందు తరలించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.