వడ్డీ వ్యాపారుల ఇండ్లు, దుకాణాలను సోదా చేసిన పోలీసులు

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో వడ్డీ వ్యాపారలు నిర్వహిస్తున్న వ్యాపారుల ఇండ్లు, దుకాణాలు పోలీసులు సోదాలు నిర్వహించారు మండల కేంద్రంలో ఎలాంటి అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం, అధిక వడ్డీలు వసూలు చేస్తున్న గాంధారి మండలం కేంద్రం లోని పలు ఇండ్లు, ఆఫీస్ లు, దుకాణాల సముదాయాల్లో  సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో గాంధారి ఎస్సై ఆంజనేయులు, సిబ్బందితో సహా పలు ఇండ్లలో దుకాణాల్లో సోదాలు జరిపి విలువైన పత్రాలు, ప్రామిసరీ నోట్లు, బాండ్లు  మొదలగునవి స్వాధీనం చేసుకొని  వడ్డీ వ్యాపారం చేసే రవీందర్ గౌడ్, జంగం సంతోష్, జాదవ్ గోపాల్ రావు లపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్.ఐ ఆంజనేయులు తెలిపారు.
Spread the love