నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మహబూబ్నగర్లోని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో శనివారం విద్యుత్ సరఫరాలో పలు మార్లు అంతరాయం ఏర్పడిందనే వార్త అవాస్తవమని ఆ జిల్లా టీఎస్ఎస్పీడీసీఎల్ ఆపరేషన్ సూపరింటెంట్ ఇంజినీర్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా పవర్ కట్ జరిగిందనే వాదనలో ఏ మాత్రం నిజం లేదని తెలిపారు. ఆ మీటర్ ఉన్న సబ్స్టేషన్ ట్రాన్స్ఫార్మర్లో విద్యుత్ అంతరాయం జరిగినట్టు నమోదు కాలేదని తెలిపారు. ఇందుకు సంబంధించి అక్కడి సిబ్బందితో మాట్లాడి వాస్తవాలను కూడా తెలుసుకున్నామని వివరించారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు సరికాదని ఆయన పేర్కొన్నారు.