ఓటమి భయంతోనే అధికార పార్టీ అసత్య ప్రచారాలు..

జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి
నవ తెలంగాణ-రామారెడ్డి :  సర్వేలన్నీ కాంగ్రెస్ కు అనుకూలంగా రావడంతో, కామారెడ్డి లో కెసిఆర్ ఓటమీ భయంతోనే, అధికార పార్టీ నాయకులు షబ్బీర్ అలీ కామారెడ్డి లో పోటీ నుండి తప్పుకుంటుండని అసత్య ప్రచారాలను చేస్తున్నారని సోమవారం జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ గతంలో అనేక సంక్షేమ పథకాలను, ప్రజా అభివృద్ధి పనులు చేసి ప్రజల గుండెల్లో ఉన్నారని, ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారని తెలుసుకొని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి, అధికార పార్టీ నాయకులు అసత్య ప్రచారాలను చేస్తున్నారని, ఇలాంటి వాదంతులను ప్రజలు, కాంగ్రెస్ నాయకులు నమ్మవద్దని, కామారెడ్డి గడ్డ, కాంగ్రెస్ అడ్డా అని, కామారెడ్డి గడ్డపై పుట్టిన షబ్బీర్ అలీ, ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించడం ఖాయమని, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు అధికార పార్టీ దుష్ప్రచారా, వదంతులను తింపి కొట్టాలని, పార్టీ గెలుపు కోసం సమిష్టిగా కృషి చేయాలని, పిలుపునిచ్చారు.
Spread the love