నవతెలంగాణ-కామారెడ్డి: మాచారెడ్డి మండలం గజ్జ నాయక్ తండాలో గోనె శ్రీలత–శ్రీనివాస్ దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం శుక్రవారం నిర్వహించుకున్నారు.వారి గృహప్రవేశాన్నినికి అతిథిగా గ్రామ సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ హాజీరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంత ఇల్లు కల సాకారం అవుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్ధిదారులు అందుకొని సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారి గృహప్రవేశాన్ని పురస్కరించుకొని ఆ కుటుంబానికి గ్రామ సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్ నూతన వస్త్రాలను పంపిణీ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లకావత్ బిక్షపతి, పంచాయతీ కార్యదర్శి స్వామి, వార్డ్ మెంబర్లు, సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ లబ్ధిదారులకు నూతన వస్త్రాల పంపిణీ చేసిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -



