దోస్పల్లి సర్పంచ్ సేవలు ప్రసంశనియం

నవతెలంగాణ – జుక్కల్
దోస్పల్లి సర్పంచ్ సేవలు ప్రసంశనియం అని దోస్పల్లి జీపి సెక్రట్రి జాదవ్ మనోహర్ అన్నారు. శనివారం నాడు గ్రామస్తుల ఆధ్వర్యంలో జీపీ పాలక వర్గం నకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసారు. ఈ సంధర్భంగా జేపిఎస్ జాదవ్ మనోహర్ మాట్లాడుతు గ్రామాల ఆభివృద్దిలో సర్పంచ్ ల పాత్ర కీలకంగా ఉంటుందని , సర్పంచ్ గ్రామానికి దిక్సూచిల వ్వవరిస్తారని కోనియాడారు. అంతకు ముందు  సర్పంచ్ , ఉప సర్పంచ్ , వార్డు సబ్యులకు పంచాయతి సెక్రట్రి, ఆశా కార్యకర్త , గ్రామస్తులు సన్మానించారు. మిఠాయిల పంతి పెట్టారు. ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఆశా వర్కర్  బశవ్వ తదితరులు పాల్గోన్నారు.
Spread the love