నవతెలంగాణ-కుభీర్
మండల కంద్రమైన కుభీర్ తో పాటు ఫార్డి (బి ), పల్సి, సోనారి, మలేగాం, నిగ్వ, తదితర గ్రామంలో సోమవారం గణనాథులు కొలువుదీరారు. కుభీర్, ఫార్డి, పల్సి గ్రామాల్లో కర్ర వినాయకుడిని ప్రతిష్టించారు. ఈ వినాయకుడు తొమ్మిది రోజుల పాటు పూజలందుకోనుడు. మండలానికి సరిహద్దులో మహారాష్ట్ర లోని పాలజ్ గ్రామంలో కోరిన కొరికేలు తీర్చే సత్య గణేశుడిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్టంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తదితర ప్రాంతాలతో పాటు అధిక సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తొమ్మిది, 11 రోజుల పాటు పూజలు అందుకొని చివరి రోజున గ్రామానికి సమీపంలో ఉన్న వాగులో చెరువులోకి గణేష్షునికి నీళ్లు చాలుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బీరువాలో భద్రపారుస్తారు.
కొలువుదీరిన గణనాథులు
- Advertisement -
- Advertisement -



