– కాంగ్రెస్ పార్టీపై విమర్శలు
దళితులు, బీసీలు, గిరిజనులకు అండగా ఉంటా : ప్రధాని మోడీ
హౌషియార్ పూర్ : లోక్సభ ఎన్నికల ప్రచారానికి తుది రోజైన గురువారం ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. పంజాబ్లోని హౌషియార్ పూర్లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. దళితులు, బీసీలు, గిరిజనుల రిజర్వేషన్లను గుంజుకునేందుకు తాను ఎవరినీ అనుమతించనని స్పష్టం చేశారు.విపక్ష కాంగ్రెస్, ఇండియా బ్లాక్ పార్టీలు రిజర్వేషన్లకు రక్షణ కవచంగా ఉన్న తనపై ఆగ్రహంగా ఉన్నాయని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ను కొల్లగొట్టిన ట్రాక్ రికార్డ్ ఆ పార్టీల సొంతమని ఆరోపించారు.
రాజ్యాంగ స్ఫూర్తిని, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్ఫూర్తిని విపక్షాలు అవమానిస్తున్నాయని మండిపడ్డారు. దళితులు, ఓబీసీల రిజర్వేషన్లకు కోత విధించి వాటిని ముస్లింలకు కట్టబెట్టాలని ఆ పార్టీలు కోరుకుంటున్నాయని అన్నారు. వారి కుట్రను మోడీ బహిర్గతం చేయడంతో నన్ను నిందించడమే పనిగా పెట్టుకున్నాయని ఆరోపించారు.