లక్ష్మీపూర్ లో దొంగల బీభత్సం

– మళ్లీ మూడిళ్ళల్లో చోరీ
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
తంగళ్ళపల్లి మండలంలో దొంగలు విజృంభిస్తున్నారు. వారం రోజులు గడవకముందే మళ్లీ దొంగతనాలకు పాల్పడ్డారు దొంగలు. తంగళ్ళపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామ శివారులోని లక్ష్మీపూర్ కాలనీలో శుక్రవారం తెల్లవారుజామున తాళాలు వేసిన ఇళ్లలో దొంగలు మూడిళ్లలో చోరీలకు పాల్పడ్డారు. పసుల నర్సయ్య ఇంటిలో అర తులం బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు, రూ.9వేల నగదు,అట్టెల నర్సయ్య ఇంటిలో రూ 3వేల నగదు, పసుల మల్లేశం ఇంటిలో దొంగలు చొరబడి వస్తువులను చిందరవందరగా పడేసి వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. దొంగలు దొంగతనాలు చేసేటప్పుడు పక్క ఇంటివారి ఇంటిలో నుండి ఎవరూ బయటకి రాకుండా గడియ లు పెట్టి మరి దొంగతనానికి పాల్పడుతున్నారు. వరుస దొంగతనాలతో గ్రామాల ప్రజలు భయాందోళన గురవుతున్నారు. రాత్రిళ్ళు ఇళ్లకు తాళాలకు వేసి వెళ్లాలంటే భయపడుతున్నారు.

Spread the love