– కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ అధ్యక్షునిగా ఎన్నికైన మోర రాజు

– కాంగ్రెస్ సేవా దళ్ జిల్లా అధ్యక్షునిగా మోర రాజు
– జిల్లా కాంగ్రెస్ అధ్యక్షున్ని కలిసిన రాజు
నవతెలంగాణ – తంగళ్ళపల్లి
కాంగ్రెస్ పార్టీ జిల్లా సేవాదళ్ అధ్యక్షునిగా మోర రాజు ఎన్నికయ్యారు. తంగళ్ళపల్లి మండల కేంద్రానికి చెందిన మోర రాజు ను రాజన్న సిరిసిల్ల జిల్లా సేవాదళ్ అధ్యక్షునిగా నియమిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు నియామక పత్రాన్ని జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను బుధవారం మోర రాజు మర్యాదపూర్వకంగా మోర రాజు ను అభినందిస్తూ,  నియామక పత్రాన్ని కూడా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా చురుకుగా పనిచేస్తూ పార్టీ ఆదేశాల మేరకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టాలని వారు తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మోర రాజు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందన్నారు. ఇదే చురుకుదనంతో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ దిశగా కార్యకర్తలు అందరం పనిచేస్తామని వారు తెలిపారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మోర రాజుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు నెరెళ్ళ నార్సింగం గౌడ,మోరా లక్ష్మీరాజం, సామల గణేష్శి,వప్రసాద్, సుద్దాల శ్రీనివాస్ గౌడ్, శ్రీకాంత్,ఇటుకల మహేందర్, సామల దేవదాస్, నగరం సత్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు.
Spread the love