అంగన్ వాడీ పిల్లలపై ప్రత్యేక శ్రద్ద చూపాలి : కలెక్టర్

నవతెలంగాణ – తంగళ్ళపల్లి
మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని అంగన్వాడీ కేందాన్ని బుధవారం క్షేత్రస్థాయిలో కలెక్టర్ తనిఖీ చేశారు.అలాగే పిల్లల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. వారికి అందిస్తున్న పోషకాహారం పై అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో సరుకుల ఉన్నాయా అని ఆరా తీశారు. వాటి సరఫరా పై డీ డబ్ల్యుఓ లక్ష్మీ రాజంను అడిగి తెలుసుకున్నారు. పిల్లల ఆరోగ్యo వివరాలు, వారితో రోజూ చేయించే కార్యక్రమాల వివరాలను పరిశీలించారు. అనంతరం పిల్లలకు కూరగాయలు, పండ్ల చిత్రాలు చూపించి వాటి పేర్లు చెప్పమని అడిగారు. పలక పై ఏ, బీ, సీ, డీ లు రాసి పిల్లలకు చూపించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రoలో పిల్లల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే ఇక్కడ అందిస్తున్న సేవల పై అవగాహన కల్పించాలన్నారు. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందేలా కార్యక్రమాలు రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు.  అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలోని సౌకర్యాలను పరిశీలించారు. బడి లో సమస్యలపై హెచ్ ఎంను అడిగి తెలుసుకున్నారు.

Spread the love