జింబాబ్వే టూర్‌.. ఇండియా టీమ్‌లో మూడు మార్పులు

నవతెలంగాణ – జింబాబ్వే: పర్యటనకు టీమ్‌ ఇండియా బయలుదేరింది. శుభ్‌మన్‌ గిల్‌ నేతృత్వంలో జట్టు ఈ నెల 6 నుంచి ఐదు టీ20ల్లో తలపడనుంది. అయితే తొలి రెండు మ్యాచుల కోసం ముగ్గురు ప్లేయర్లను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ మార్చింది. సంజు శాంసన్‌, శివమ్‌ దూబె, యశస్వి జైస్వాల్‌ స్థానంలో సాయి సుదర్శన్‌, జితేశ్‌ శర్మ, హర్షిత్‌ రాణాను తీసుకున్నారు. తుపాను కారణంగా భారత ప్రపంచకప్‌ జట్టు బార్బడోస్‌లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అందులో శాంసన్‌, దూబె, యశస్వి ఉన్నారు.

Spread the love