తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి కలకలం

నవతెలంగాణ తిరుపతి: తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత, ఎలుగు బంటి కలకలం రేపాయి. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసి చంపిన ప్రాంతంలోనే.. ఈ నెల 13, 26 తేదీల్లో వీటిని గమనించినట్టు అటవీశాఖ అధికారులు ట్రాప్‌ కెమెరాల ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలో నడకమార్గంలో వచ్చే భక్తులను టీటీడీ హెచ్చరించింది. ఒంటరిగా వెళ్లవద్దని, అప్రమత్తంగా ఉండాలని, గుంపులు గుంపులుగా భక్తులు రావాలని టీటీడీ సూచించింది.

Spread the love