నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్హెచ్ఏఐ టోల్ప్లాజాల వద్ద టోల్ రుసుములు జూన్ 3 (ఆదివారం అర్ధరాత్రి) నుంచి పెరగనున్నాయి. ఏటా ఏప్రిల్ 1న టోల్ రుసుముల ధరలు పెంచుతుండగా.. ఈసారి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెంపును వాయిదా వేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. చివరి విడత పోలింగ్ జూన్ 1న ముగియడంతో టోల్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఎన్హెచ్ఏఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రుసుముల పెంపు సగటున 5 శాతం వరకు ఉంటుంది. పెంచిన ధరలు 2025 మార్చి 31 వరకు అమలులో ఉంటాయి.