నేడు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్‌ నిర్మాతలు

నవతెలంగాణ – అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ను టాలీవుడ్‌ నిర్మాతలు కలవనున్నారు. నేడు మధ్యాహ్నం విజయవాడలోని పవన్‌ క్యాంపు కార్యాలయంలో ఈ బేటీ జరగనుంది. 2024 ఏపీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినందుకు కూటమి ప్రభుత్వాన్ని అభినందించడం, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానాల కారణంగా ప్రస్తుతం టీఎఫ్‌ఐ ఎదుర్కొంటున్న పలు సమస్యలు, టికెట్‌ ధరల్లో వెసులుబాటు, థియేటర్లలో ఎదురయ్యే సమస్యలు వంటి అంశాలను ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ సమావేశంలో అశ్వినీదత్‌, చినబాబు, నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌, నాగవంశీ, టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు దిల్‌ రాజు, దామోధర్‌ ప్రసాద్‌, భోగవల్లి ప్రసాద్‌, డీవీవీ దానయ్య తదితరులు పాల్గొనున్నారు.

Spread the love