నవతెలంగాణ -రామన్నపేట
రామన్నపేట మండలం ఉత్తటూరు గ్రామానికి చెందిన మేడి రవిచంద్ర టిపీసీసీ అధికార ప్రతినిధిగా నియమితులైన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వేదాస్ వెంకయ్య, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వేదాస్ శ్రీధర్ లను వారి నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా జలంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.