పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌

సాయిరామ్‌ శంకర్‌, యషా శివకుమార్‌, హెబ్బా పటేల్‌ హీరో,హీరోయిన్లుగా లక్ష్మీనారాయణ పొత్తూరు సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై నవీన్‌ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్‌ పోతూరు నిర్మించిన చిత్రం ‘వెరు దరువెరు’. ఈనెల 15న సినిమాను గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత దేవరాజ్‌ పోతూరు మీడియాతో మాట్లాడుతూ, ‘మా సాయితేజ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో మేం చేసిన రెండో సినిమానే ఇది. నవీన్‌ రెడి చెప్పిన కథ వినగానే బాగా నచ్చింది. ఈ కథ కామెడీ, సెంటిమెంట్‌ బాగా నచ్చింది. మూవీలో 80 శాతం కామెడీ ఉంటుంది. దీంతో పాటు తండ్రి, సోదరి భావోద్వేగం కూడా మిక్స్‌ అయ్యి రన్‌ అవుతుంటుంది. హీరోగా అనుకున్నప్పుడు సాయిరామ్‌ శంకర్‌నే ఫిక్స్‌ అయ్యాం. ఆయన కూడా చాలా హార్డ్‌ వర్క్‌ చేశారు. ఇదొక మాస్‌ కామెడీ చిత్రం. మంచి ఎమోషన్స్‌ కూడా ఉంటాయి. మన సమాజంలో జరిగే అంశాలను తీసుకుని దాన్ని కమర్షియల్‌ యాంగిల్‌లో తీర్చిదిద్దాం. నిజ ఘటనలే ఆధారంగా తెరకెక్కించాం. కామారెడ్డిలో సినిమా స్టార్ట్‌ అవుతుంది. అక్కడి నుంచి హీరో హైదరాబాద్‌ వస్తాడు. అక్కడ కథ ఎలా ఉంటుందనేదే సినిమా. ఇప్పుడు కూడా మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే కథాంశంతో సినిమా ఉంటుంది. ఇది అందర్నీ తప్పకుండా అలరించే సినిమా అవుతుంది’ అని తెలిపారు.

Spread the love