న్యూ ఏజ్‌ ఎంటర్‌టైనర్‌ తులసీవనం

న్యూ ఏజ్‌ ఎంటర్‌టైనర్‌ తులసీవనందర్శకుడు తరుణ్‌ భాస్కర్‌ సమర్పణలో అక్షరు, ఐశ్వర్య, వెంకటేష్‌ కాకమాను, విష్ణు ప్రధాన పాత్రధారులుగా అనిల్‌ రెడ్డి దర్శకత్వం వహించిన న్యూ ఏజ్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘తులసీవనం’. ఈటీవ్‌ విన్‌ ఓటీటీ వేదికగా ఈనెల 21 నుంచి ప్రసారం కానున్న నేపథ్యంలో యూనిట్‌ గ్రాండ్‌గా ట్రైలర్‌ని లాంచ్‌ చేసింది.
డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ మాట్లాడుతూ, ‘అనిల్‌, తులసి ‘పెళ్లి చూపులు’ నుంచి నాకు సహాయ దర్శకులుగా ఉన్నారు. మాది విడదీయలేని ఓ అనుబంధం (నవ్వుతూ). తులసి అనే పేరు పెట్టాడు కానీ ఇది అనిల్‌ పిక్చరే. చాలా మంది ఫిల్మ్‌ మేకర్స్‌కి సొంత గొంతుక చెప్పాలనే తాపత్రయం ఉన్నప్పటికీ మార్కెట్‌ దష్ట్యా కొన్ని భయాలు ఉంటాయి. ఇలాంటి ప్రాజెక్ట్స్‌ చేయడం వెనుక అందరి కషి ఉంది. క్లారిటీ థీం అనేది చాలా ముఖ్యం. ఇందులో ఆ క్లారిటీ ఉంటుంది. ఖచ్చితంగా ఎంజారు చేస్తారు’ అని తెలిపారు. ‘ఇదొక క్యూట్‌ రొమాంటిక్‌ కామెడీ. స్మరన్‌ అద్భుతమైన మ్యూజిక్‌తో వేరే లెవల్‌కి తీసుకెళ్ళారు. ఇది అందరూ రిలేట్‌ చేసుకునే కథ. ప్రేమ్‌ సాగర్‌ చాలా అద్భుతమైన విజువల్స్‌ ఇచ్చారు. రవితేజ గిరిజాల చాలా బ్రిలియంట్‌గా ఎడిట్‌ చేశారు. నితిన్‌ సాయి ఈటీవీ టీంకి ధన్యవాదాలు’ అని డైరెక్టర్‌ అనిల్‌ రెడ్డి చెప్పారు.
నితిన్‌ చక్రవర్తి మాట్లాడుతూ,’అందరూ రిలేట్‌ చేసుకునే సిరిస్‌. తరుణ్‌తో ఇది మా తొలి అసోషియేషన్‌ కావడం ఆనందంగా ఉంది. ఈనెల 21న తప్పకుండా చూడండి’ అని తెలిపారు.

Spread the love