పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలు

నవతెలంగాణ – వీణవంక
పిచ్చికుక్క దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ఉయ్యాల భూదమ్మ , తాటికంటి రాజయ్య లను పిచ్చికుక్క కరవడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా గమనించిన గ్రామస్తులు ఆ కుక్కను తరిమి కొట్టారు. తీవ్ర గాయాలైన క్షతగాత్రులను 108 వాహనం ద్వారా చికిత్స నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  బూదమ్మకు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం ఆమెను వరంగల్ కు తరలించారు.
Spread the love