నవతెలంగాణ-హైదరాబాద్: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్కు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో .. ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. సేవా తీర్థ్ (PM office) లో సుమారు గంటకుపైగా వీరి సమావేశం కొనసాగింది. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో ఇరుదేశాల సహకారాన్ని మరింత పెంపొందించడంపై వారు చర్చించినట్లు భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు. అదే విధంగా స్వేచ్ఛాయుత ఇండో-పసిఫిక్ను ముందుకు నడిపించే మార్గాలపైనా ఫలవంతమైన చర్చలు జరిపినట్లు తెలిపారు. భారత పర్యటనలో భాగంగా మే 26న ఢిల్లీలో జరగనున్న క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశంలో రూబియో పాల్గొననున్నారు. ఈ కూటమిలో భారత్ సహా ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా భాగస్వాములుగా ఉన్నాయి.
ప్రధాని మోడీతో అమెరికా విదేశాంగ మంత్రి సమావేశం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



