జాతీయస్థాయి బాల సాహిత్య పురస్కారం అందుకున్న వైష్ణవి..

నవతెలంగాణ – ఏర్గట్ల
మండలంలోని తడపాకల్ గ్రామానికి చెందిన బాల రచయిత్రి డేగల వైష్ణవి రచించిన “చిన్నారి కథలకు” శ్రీవాణి సాహిత్య పరిషత్ పెందోట బాల సాహిత్య జాతీయ పురస్కారం లభించినట్లు తడపాకల్ పాఠశాల తెలుగు పండుతులు ప్రవీణ్ శర్మ తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 80 మంది రచయితలు ఈ పురస్కారానికి వారు రచించిన పుస్తకాలు పంపగా.. 9 పురస్కారాల్లో వైష్ణవి ఒక పురస్కారం లభించినట్లు ప్రవీణ్ శర్మ తెలిపారు.త్వరలో సిద్దిపేటలో జరగబోయే పురస్కార సభలో వైష్ణవికి నగదు బహుమతి,ప్రశంసా పత్రం,మెమోంటోను అందజేస్తారని అన్నారు.పురస్కారం అందుకున్న వైష్ణవికి ఉపాధ్యాయ బృందం,గ్రామస్థులు అభినందనలు తెలిపారు.
Spread the love