సర్వాయి పాపన్న అవార్డుకు ఎంపికైన వరప్రసాద్ 

నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్ 

హుస్నాబాద్ పట్టణానికి చెందిన గీతా పారిశ్రామిక సహకార సంఘం (సొసైటీ) అధ్యక్షులు పూదరి వరప్రసాద్ గౌడ్ ను “సర్దార్ సర్వాయి పాపన్న” జాతీయ అవార్డుకు ఎంపిక అయినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జాతీయ కార్యాలయంలో  జాతీయ అవార్డు గ్రహీత వరప్రసాద్ కు ఎంపిక పత్రాన్ని అందజేశారు.

Spread the love