నవతెలంగాణ-కోహెడ
ప్రజా గాయకుడు గద్దర్ మృతి తెలంగాణకు తీరనిలోటని న్యాయవాది జేరిపోతుల కిరణ్కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అణగారిన వర్గాలకు, పీడిత ప్రజలకు తన పాటతో ప్రశ్నిచడం నేర్పించిన మహానీయుడన్నారు. తెలంగాణ భాష, యాసలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి అణగారిన వర్గాల జీవితల్లో వెలుగు బాటలు వేసిన వ్యక్తి అన్నారు. దున్నేవాడికి భూమి కావాలని, భూమి లేని పేదలకు భూమిని ఇవ్వాలని తన పాటల ద్వారా ప్రభుత్వలను ప్రశ్నించాడన్నారు. రాష్ట్ర సాధనలో ఆయన కీలకంగా వ్యవహారించారన్నారు. ఈ కార్యక్రమంలో కల్లికోట రాహుల్, జేరిపోతుల మల్లేష్, పొన్నాల సంపత్, డి.ఐలయ్య, బోయిని దివాకర్, మురళి, బాబు, ప్రశాంత్, జి. ఇస్సాక్, తదితరులు పాల్గొన్నారు.