నవతెలంగాణ – హైదరాబాద్: భారత నావికాదళానికి కొత్త చీఫ్గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. ఆ పదవిలో ఉన్న అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో అనేక కీలక బాధ్యతలను నిర్వహించిన త్రిపాఠి ప్రస్తుతం నావికాదళ సిబ్బందికి వైస్-చీఫ్గా ఉన్నారు. ఈ నెలాఖరు నుంచి కొత్త బాధ్యతలను స్వీకరించనున్నారు. 1964, మే నెలలో జన్మించిన ఆయన 1985, జూలై నుంచి భారత నేవీ ఎగ్జిక్యూటివ్ విభాగంలో చేరారు.