కాంగ్రెస్‌లో చేరిన విద్యాస్రవంతి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
విద్యావేత్త, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విద్యా స్రవంతి కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి దీపాదాస్‌మున్షి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దీపాదాస్‌ మాట్లాడుతూ విద్యా స్రవంతి లాంటి విద్యా వేత్తలు, మేధావులు కాంగ్రెస్‌ పార్టీలోకి రావడం హర్షణీయమన్నారు. తమ పార్టీలోకి వచ్చే వారి సేవలను ఉపయోగించుకుంటారని తెలిపారు. కాంగ్రెస్‌ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యేవారు కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love