విద్యార్థినిలకు గ్రామాభివృద్ధి కమిటీ ఆర్థిక ప్రోత్సాహం

నవతెలంగాణ  – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన  విద్యార్థినులకు స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఆర్థిక ప్రోత్సాహం అందించింది. ఈ నెల 17,18,19 తేదీలలో  కరీంనగర్ జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలలో పాఠశాలకు చెందిన విద్యార్థినిలు దివ్య, కృష్ణశ్రీ  పాల్గొననున్నారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో  రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థినిలకు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ  ప్రతిభ కనబర్చలని ఆకాంక్షిస్తూ, గ్రామ అభివృద్ధి కమిటీ తరుపున ఆర్థిక  ప్రోత్సాహం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు అవారి శ్రీనివాస్, సుంకరి విజయ్, మారుపక నరేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, ఉపాధ్యాయులు దేవన్న, కిషన్, మాధురి, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love