ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయం: పల్లె స్వరూప

నవతెలంగాణ – శంకరపట్నం
క్యాబినెట్ సమయంలో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయుటకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ముదిరాజ్ కులాస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నామని ముదిరాజ్ మహాసభ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లె స్వరూప అన్నారు. ఈ సందర్భంగా బుధవారం శంకరపట్నం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ,తెలంగాణలో బీసీ జనాభాలో అత్యధికంగా జనాభా కలిగిన సామాజిక వర్గం ముదిరాజులదని, ముదిరాజులు ఎన్నో దశాబ్దాల నుండి పోరాటాలు చేస్తున్న, గత బీఆర్ఎస్  ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పార్టీలు మారుతున్నాయి నాయకులు మారుతున్నారు. కానీ ముదిరాజులను పట్టించుకున్న వాళ్లే లేరన్నారు.నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అభినందనీయం  అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ముదిరాజుల ఎన్నో దశాబ్దాల కలలను సహకారం చేసిందన్నారు.ఈ సందర్భంగా యావత్ ముదిరాజుల తరపున  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,కార్పొరేషన్ ఏర్పాటుకై  తీవ్రంగా కృషి చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Spread the love