బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

– ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కంకణాల నర్సింలు.
నవతెలంగాణ – తొగుట 
బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మండ లం ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు, బీజేపీ సీనియ ర్ నాయకుడు కంకణాల నర్సింలు అన్నారు. ఆది వారం మండలంలోని వేంకట్రావుపేట గ్రామంలో గత శుక్రవారం రాత్రి గుండె పోటుతో మృతి చెంది న సపాయి కార్మికుడు ఈదుగాళ్ల భిక్షపతి,మూడు రోజుల క్రితం మృతి చెందిన కల్లెపు చంద్రయ్య ల కుటుంబ సభ్యులను పరామర్శించారు.మృతుడు భిక్షపతి భార్య మల్లవ్వ, కుమారుడు మల్లేశం ను, చంద్రయ్య భార్య సత్తవ్వ,మనుమడు నవీన్ లను ఓదార్చారు.రూ.3000 వేల చొప్పున ఇరు కుటంబ సబ్యులకు వేరు వేరుగా ఆర్థిక సహాయం అందిం చారు. బాధిత కుటుంబాలకు ఎల్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కత్తుల రమేష్, కొయ్యడ నరేం దర్, బొగ్గుల నర్సింలు,బి. దయాకర్, కళ్లెపు భాస్కర్, వడ్డే స్వామి, నర్సింలు, పోచయ్య, భూపతి, రాములు, లక్ష్మణ్, రాములు, బండారి కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love