![](https://navatelangana.com/wp-content/uploads/2024/06/IMG-20240624-WA0416-135x300.jpg)
నవతెలంగాణ-మల్హర్ రావు : అనాధ పిల్లలకు అండగా ఉంటామని ప్రొపెసర్ జయశంకర్ పౌoడేషన్ వ్యవస్థాప అధ్యక్షుడు అయిలి మారుతి అన్నారు.సోమవారం మండల కేంద్రమైన తాడిచెర్లలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు తల్లి తండ్రులు లేని నిరుపేద, అనాథ పిల్లలు ఎవరయినా ఉంటే ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ సంస్థ దృష్టికి తీసుకరావాలని కోరారు. 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు వారిని ఉచితంగా చదివించి వారికి ఉన్నత భవిష్యత్తు కోసం పూర్తి బాధ్యతలు తీసుకొని వైద్యం, విద్య వసతులు ఉచితంగా అందజేస్తామన్నారు.తల్లిదండ్రులు లేని అనాధ పిల్లలకు మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు.భూపాలపల్లి, ములుగు జిల్లాల వారికే ఈ అవకాశం ఉందన్నారు.పూర్తి వివరాలకు సెల్ నేఁబర్లకు 9391075767, 7095203260 సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో పౌoడేషన్ మండల అధ్యక్షుడు గుగ్గిళ్ల రాజ్ కుమార్ పాల్గొన్నారు.