నవతెలంగాణ – హైదరాబాద్: ఎండలతో దేశం ఉడికిపోతున్న వేళ వాతావరణశాఖ మరో చల్లని కబురుచెప్పింది. గురువారమే కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు అనుకున్న తేదీ కంటే ముందుగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. త్రిపుర, మేఘాలయ, అస్సాం, పశ్చిమబెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లోకి ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించాయి. లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు సహా ఇతర ప్రాంతాల్లోకి కూడా ముందుగానే ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.