- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ ఎంపీ షకీబ్ అల్ హసన్ నివాసంపై మగురా నగరంలో కొందరు నిరసనకారులు దాడి చేశారు. పెట్రోల్ బాటిళ్లతో ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించినట్లు నివేదికలున్నాయి. ఇటీవల షేక్ హసీనా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొనడమే దీనికి కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న షకీబ్, బంగ్లాదేశ్ ప్రభుత్వం పూర్తి భద్రత కల్పిస్తేనే దేశానికి తిరిగి వస్తానని, తనపై ఉన్న ఆరోపణలను ఎదుర్కొంటానని రాయిటర్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.
- Advertisement -



