కరీంనగర్ ఎంపీగా రాజేందర్ రావును గెలిపించండి 

– తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్
నవతెలంగాణ – కోహెడ 
కరీంనగర్ ఎంపీగా వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ అన్నారు. ఆదివారం ఆ మండలంలోని తంగళ్ళపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే  ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు మనుగడ ఉంటుందన్నారు. బిజెపి ప్రభుత్వంలో  దేశంలో అనేక రాష్ట్రాలలో దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు జరిగాయి అన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని పలుమార్లు ప్రజాప్రతినిధులు మాట్లాడడం సరికాదన్నారు.  బిజెపి ప్రభుత్వం ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, రైల్వే ప్రైవేటీకరణ చేయడం భారతదేశంలో ప్రైవేటు వ్యక్తులకు పారిశ్రామికవేత్తలకు కొమ్ము కాస్తున్నదన్నారు. నిత్యవసర సరుకుల ధరలు పెరగడం, డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడం తప్ప ఏమిచేయలేదన్నారు. ప్రతి సామాన్య వ్యక్తికి అకౌంట్లో 15 లక్షలు వేస్తామనడం, నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని నమ్మించారన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి గెలిచాల రాజేందర్ రావును భారిమెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యాటెల్లి బాబు, పొన్నాల ఫ్రాన్సిస్ ,గిరిమల్ల చంద్రమౌళి ,గంగారపు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love