![](https://navatelangana.com/wp-content/uploads/2024/04/IMG-20240422-WA0158.jpg)
డిచ్ పల్లి మండల కేంద్రంలోని రైల్వేస్టేషస్ ఎదుట వడ్లలోడుతో వెళ్తున్న లారీ అధికలోడు కారణంగా బోల్తాపడింది. లారీ సిరికొండ మండలం నుంచి నిజామాబాద్ లోని ఒక రైసు మిల్లుకు వెళ్లుండగా మార్గ మధ్యంలోని డిచ్ పల్లి కి రాగానే ఆధికలోడు వల్ల వడ్లసంచులు పూర్తిగా ఒకవైపు వంగిపోవడంతో మెల్లిగా బోల్తాపడింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. డ్రైవర్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. బోల్తాపడగానే క్యాబిస్ లోపల నుంచి డ్రైవర్ బయటకు వచ్చారు.