గుండెపోటుతో యువ రైతు మృతి

– రోడ్డున పడ్డ కుటుంబం
– ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రమాదవశాత్తు గుండెపోటుతో మడక రాజబాబు (34) అనే యువ రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని  కొయ్యుర్ గ్రామంలో శనివారం  చోటుచేసుకుంది.స్థానికులు,కుటుంబ సభ్యుల పూర్తి కథనం ప్రకారం రాజబాబు తనకున్న కొద్దిపాటి పొలంతోపాటు ఇంటిముందు ఉన్న చిన్నపాటి పంప్ చార్ కొట్టును నడిపిస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు.శనివారం రాత్రి అకస్మాత్తుగా ఛాతీలో నొప్పిరావడంతో కుప్పకూలిన అతన్ని కుటుంబ సభ్యులు చూసే క్రమంలో మరణించినట్లుగా కన్నిమున్నిరైయ్యారు. మృతునికి  ఇద్దరు ఆడపిల్లలు,భార్య ఉన్నారు.కుటుంబ పెద్దదిక్కు కోల్పోవడంతో బాధిత కుటుంబం రోడ్డున పడ్డారు.ఆర్ధికంగా బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు.
Spread the love