ఫిబ్రవరిలో ప్లాస్ట్‌ ఇండియా ఎక్స్‌పో

న్యూఢిల్లీ : ప్లాస్టిక్స్‌ రంగంలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్లాస్ట్‌ ఇండియా సంస్ధ 11వ ఎడిషన్‌ ఇంటర్నేషనల్‌ ప్లాస్టిక్స్‌ ఎగ్జిబిషన్‌ ప్రదర్శనను ఫిబ్రవరి 1 నుంచి 5వ తేది వరకు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ప్లాస్ట్‌ ఇండియా-2023ను న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగనుందని తెలి పింది. ఆసియాలో అతిపెద్ద ప్లాస్టిక్‌ ఎగ్జిబిషన్‌గా గుర్తింపు పొందిన ఈ ఎక్స్‌ పోలో ప్రపంచవ్యాప్తంగా 1800 మంది ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారని ప్లాస్ట్‌ ఇండియా ఫౌండేషన్‌ అధ్యక్షులు జిగేష్‌ దోషి తెలిపారు. కరోనా కారణంగా దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత దీన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Spread the love