శుభాకాంక్షలు తెలిపిన ప్రాధానోపాధ్యాయుడు సిహెచ్.తిరుపతి
నవ తెలంగాణ-మల్హర్ రావు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన ఎస్.ఎస్.సి ఫలితాల్లో పరీక్ష ఫలితాల్లో మండల కేంద్రమైన తాడిచెర్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించి విజయభేరీ మోగించారు.ఇందుకు పాఠశాల ప్రాధానోపాధ్యాయుడు సిహెచ్.తిరుపతి విద్యార్థులకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పాఠశాలలో మొత్తం 55 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు కాగా విడుదలైన ఫలితాల్లో 55 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైయ్యారని తెలిపారు.ఉత్తమమైన ఫలితాలు రావడానికి కృషి చేసినటువంటి విద్యార్థులకు,అధ్యపక బృందానికి,సహకరించిన తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.పాఠశాల టాపర్ కాకుండా మండల టాపర్ గా ఎం.ప్రణవి 564 మార్కులు,పాఠశాల ద్వితీయ స్థానంలో 560 మార్కులతో కె.లాస్య,540 మార్కులతో తృతీయ శ్రేణిలో ఏ.అశ్విత నీలిచినట్లుగా తెలిపారు.
తాడిచెర్ల హైస్కూల్ పధిలో వందశాతం ఉత్తీర్ణత.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



